Thursday, April 21, 2011

పంచతంత్ర కథకు వపా బొమ్మ

ఇదొక పంచతంత్ర కథ. నాకు గుర్తున్నంత వరకూ వ్రాస్తాను. ఒక చింపాంజీ అన్ని విద్యలూ నేర్చి అచ్చం మనిషిలా ఉండటం నేర్చుకుని దేశ రాజుగారి దగ్గరకు వెళ్లి తన విద్యలన్నీ చూపిందట . ఆయన చింపాంజీ విద్యలు అన్ని చూసి మురిసిపోయి, తన అంగరక్షకునిగా నియమించారుట. ఒక రోజున రాజుగారు హాయిగా శయనిస్తూ ఉండగా, చింపాంజీ అంగరక్షకుడు కాపలా కాస్తున్నాడు. కాసేపటికి ఒక కీటకం రాజుగారి మీద వాలింది. చింపాంజీ గారు కీటకాన్ని తరమబోయ్యారు, కీటకం అక్కడ నుంచి కదలలేదు. చింపాంజీ అంగరక్షకుడు కీటకాన్ని తరమటమే తన కర్తవ్యం అనుకుని కత్తితో ఒక్కటి వేశాడు. కీటకం తప్పించుకుని ఎగిరిపోయింది, కాని పాపం రాజుగారు కత్తి వేటుకు మరణించాడు.

మనిషికి ఎన్నెన్ని విద్యలు తెలిసినా "బుద్ధి" లేకపోతె విచక్షణ ఉండదు. విచక్షణ తెలియని వారికి ఎన్ని విద్యలున్నా వృధాయే కాక ప్రమాదం కూడా!

పాపయ్య గారు చింపాంజీ ముఖంలో చక్కటి భావాలను తన కుంచెతో స్పురింపచేసారు.

No comments:

Post a Comment

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.